తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే విజయవాడలో జరుగుతోన్న మహానాడులో పాల్గొన్న తెలంగాణ టీటీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి వేదికపై మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై పలు జోకులతో పాటు ఓ కథ చెప్పారు అయన చెప్పిన కథకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఎంపీ బుట్టా రేణుకా కడుపుబ్బా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే వైసీపీ కార్యకర్తలు మాత్రం బుట్టా రేణుకను తప్పు పడుతున్నారు.తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ని అంతగా తిడుతుంటే కడుపుబ్బా నవ్వడమేంటి అని విమర్శిస్తున్నారు.