ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.అందులో భాగంగా ఒంగోలు జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ,టీడీపీ పార్టీ సీనియర్ నేత మన్నే రవీంద్ర ఆ పార్టీకి గుడ్ బై చెప్పే సూచనలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన
మీడియాగా ముద్రపడిన పచ్చ మీడియాలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది .
ఈ కథనంలో పార్టీలో ఎంతో సీనియర్ నేత అయిన తనకు వరసగా అవమానాలు జరుగుతున్నాయి.అధికారం ఉన్న కానీ జిల్లాకు ఏమి చేయలేకపోతున్నాను.అధికార మదంతో నేతలు దోచుకోవడం తప్పా ప్రజలకు ఏమి చేసింది లేదు.
పార్టీలో పెరుగుతున్న అవినీతి అక్రమాలను చూడలేక ..అవమానాలను తట్టుకోలేక పార్టీ మారుతున్నాను అని ..అందుకు మాజీ మంత్రి ,వైసీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ను కలిసి చెప్పారని ఆయన అన్నట్లు వార్తల సారాంశం ..