టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి .ఈ మూవీలో టైటిల్ రోల్ లో యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించగా ఇతర పాత్రలలో సమంత,విజయ్ దేవరకొండ ,ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు .దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు .
ఈ నెల తొమ్మిదో తారీఖున విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల భారీ కలెక్షన్లను సాధించడమే కాకుండా అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది .ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మహానటి మూవీ ముప్పై కోట్ల రూపాయల మార్కును అందుకుంది అని చిత్రం యూనిట్ తెలిపింది ..