Home / ANDHRAPRADESH / రాహుల్ గాంధీతో కరచాలనం చేసిన చంద్రబాబు

రాహుల్ గాంధీతో కరచాలనం చేసిన చంద్రబాబు

కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామితో ఈ రోజు ఆ రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే.అయితే ఈ కార్యక్రమంలో ఉహించని సన్నివేశం చోటు చేసుకుంది.ఒకే వేదికపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, మమతా బెనర్జీ, మాయావతి వంటి హేమాహేమీలంతా కొలువుదీరారు.మొదటగా కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఆ తరువాత ప్రమాణస్వీకారం పూర్తి కాగానే జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం వేదికపై ఉన్న పెద్దలంతా ఒకరితో మరొకరు కరచాలనం చేసుకుంటూ, చేతులు గాల్లో ఊపుతూ సంతోషంగా గడిపారు.

ఇంతలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత రాహుల్ భుజంపై చంద్రబాబు చేయి వేసి, అభినందించారు. కొన్ని క్షణాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకోవడానికే ఈ కార్యక్రమానికి హాజరైనట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే కాంగ్రెస్, టీడీపీ అధినేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం, మాట్లాడటం… ఊహించనటువంటి ఒక కొత్త సన్నివేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat