తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగుడెం గ్రామానికి చెందిన ప్లోరైడ్ భాధితుడు అంశల స్వామికి అండగా నిలిచారు.వివరాల్లోకి వెళ్తే..మంత్రి కేటీఆర్ కొన్ని రోజుల క్రితం నల్లగొండ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా అంశల స్వామి మంత్రి కేటీఆర్ దగ్గరికి వచ్చి తన భాదను విన్నవించాడు.ఫ్లోరైడ్ బారిన పడి జీవచ్చంలా మారానని , తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.వెంటనే చలించిన మంత్రి కేటీఆర్ స్వామికి అన్ని విధాల అండగా ఉండాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ను కోరారు.
ఈ మేరకు స్వామి ఇవాళ కలెక్టర్ ఉప్పల్ ను కలెక్టరేట్ లో కలిశాడు. స్వామి శివన్నగూడెంలో ఇల్లు కట్టుకోవడానికి కావల్సిన ఆర్ధిక సాయం సుమారు 6 లక్షలు అందజేస్తామని కలెక్టర్ చెప్పారు. తన కులవృత్తి అయిన క్షౌరశాల (సెలూన్) ఏర్పాటుకు మరో రెండు లక్షలు కలెక్టర్ ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేశారు. మంత్రి కేటీఆర్ కు, జిల్లా కలెక్టర్ గౌరవ్ కు ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామి ధన్యవాదాలు తెలిపాడు.