ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు..వారి సమస్యలను తీర్చడం కోసం నిరంతరం వారికి భరోసాన్నిస్తు ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కృష్ణా జిల్లాలో కోనసాగుతుంది. ప్రజాసంకల్పయాత్ర 152వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం జననేత వైఎస్ జగన్ మచిలీపట్నం నియోజవకర్గం పొట్లపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్తపూడి క్రాస్ రోడ్డు మీదుగా బుద్దాల పాలెం వరకు పాదయాత్ర కొనసాగనుంది. జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారి పొడవునా వైఎస్ జగన్కు ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. రోజు వేలాది మంది జగన్ తో పాగు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 1937.1 కిలోమీటర్లు నడిచారు.
