మేడే వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మే డే సందర్భంగా మంత్రులు నాయిని, కేటీఆర్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం మంత్రి కేటీ ఆర్ మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోసం ప్రజలు ధర్నాలు చేసిన్రని, ప్రభుత్వ చేతిగానితనం వల్ల పవర్ హాలీడేలు ప్రకటించిన్రని ఆరోపించారు.కేవలం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను తీర్చినట్లు వెల్లడించారు. అన్ని రంగాలకు నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నమన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు కాంగ్రెస్, టీడీపీ చేసిందేమీ లేదన్నారు . ప్రజల గుండెల్లో నిండుగా ఉన్న కేసీఆర్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని అన్నారు . మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని కేటీఆర్ చెప్పారు .
