టీం ఇండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఆమ్రపాలి పై న్యాయపోరాటానికి దిగారు .ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఆమ్రపాలి గ్రూపుపై ఎంఎస్ ధోని పిర్యాదు చేశారు .అందులో భాగంగా ఆమ్రపాలి సంస్థ తనకు మొత్తం నూట యాభై కోట్లు ఇవ్వాలని ఆరోపిస్తూ దావా దాఖలు చేశారు .ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఎంఎస్ ధోనీకి ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు చెల్లించలేదని ధోనీ వాదన. అయితే ఇప్పటికే ఈ సంస్థ ఆర్థిక నష్టాల్లో ఉందని నిపుణులు అంటున్నారు .ఇప్పటికే మరోవైపు కెఎల్ రాహుల్ ,భువనేశ్వర్ కుమార్, డుప్లెసిస్ లు కూడా అమ్రపాలిపై ఢిల్లీ హైకోర్టులో రికవరీ దాఖలు దావా వేశారు .
