Home / ANDHRAPRADESH / వంగ‌వీటి రాధా షాకింగ్ డెసీష‌న్‌.!!

వంగ‌వీటి రాధా షాకింగ్ డెసీష‌న్‌.!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. 136 రోజులు అవివ‌రామంగా, ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తూ న‌డుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు త‌మ‌కు పింఛ‌న్ రావ‌డం లేద‌ని, నిరుద్యోగులు అయితే, చంద్ర‌బాబు స‌ర్కార్ ఉద్యోగాల నోటిఫికేష‌న్లు వ‌ద‌ల‌డం లేద‌ని, రుణ‌మాఫీ, డ్వాక్రా రుణాలు ఇలా వారి వారి స‌మ‌స్య‌ల‌ను వైఎస్ జ‌గ‌న్ తో చెప్పుకుంటున్నారు.

కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వాడ‌కు చేరుకున్న సంద‌ర్భంగా చిట్టిన‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంగ‌వీటి రాధ‌ మాట్లాడుతూ.. కృష్ణ‌మ్మ సాక్షిగా చెప్తున్నా.. కృష్ణా జిల్లాలో ఉన్న 17 అసెంబ్లీ సీట్ల‌ను వైసీపీకే వ‌చ్చేలా నిరంత‌రాయంగా కృషి చేస్తానంటూ వైఎస్ జ‌గ‌న్ ఎదుట‌ ప్ర‌మాణం చేశారు. ఇవాళ వైఎస్ జ‌గ‌న్ కృష్ణా జిల్లాలోకి అడుగు పెడుతుంటే.. కృష్ణా వార‌ధి సైతం క‌దిలింద‌న్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు మ‌ళ్లీ అమ‌లు కావాలంటే… వైఎస్ జ‌గ‌న్ సీఎం కావాల‌ని, జ‌గ‌న్‌ను సీఎం చేసే బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని చెప్పారు వంగ‌వీటి రాధా. ప్ర‌త్యేక హోదా విషయంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి సాక్షిగా ప్ర‌ధాని మోడీ, సీఎం చంద్ర‌బాబు హామీ ఇచ్చి.. తీరా ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని విమ‌ర్శించారు వంగ‌వీటి రాధ‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat