ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. అధికార దర్పంతో తెలుగు తమ్ముళ్ల్లు ప్రభుత్వ అధికారులపై చేస్తున్న దాడులకు తెరపడటం లేదు. తాజాగా మహిళా కండక్టర్పై టీడీపీ నేత దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం వణుకూరుకు చెందిన రెంటపల్లి ఇందిర విజయవాడ డిపోలో కండక్టర్గా పని చేస్తోంది. మంగళవారం రాత్రి రూట్ నంబర్ 10 బస్సును పెనమలూరు హైస్కూల్ సెంటర్ వద్ద వెనక్కి మళ్లించేందుకు డ్రైవర్కు సూచనలు చేస్తున్నారు. టీ స్టాల్ వద్ద గ్రామానికి చెందిన కిలారు ఆంజనేయులు బస్సు నడిపే విధానం ఇదేనా అంటూ వెళ్లి కండక్టర్పై దురుసుగా వ్యవహరించి, దాడి చేసి గాయపర్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
