తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి నల్లగొండ జిల్లా కేంద్రంలో సమీకృత మత్స్య కారుల అభివృద్ధి పథకం పై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని ప్రసగించారు.చేపల పెంపకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75శాతం రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
రూ 50లక్షల రుణానికి గాను రూ.5.60లక్షల సబ్సిడీను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.మత్య్సకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 1000 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని..చేపల పెంపకంపై ఆసక్తి ఉన్న మత్స్య కారులకు రుణాలు మంజూరీకీ ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యే భాస్కర్ రావు, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.