ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ పార్టీ ఎంపీలు గత నాలుగు రోజులుగా దేశ రాజధాని డిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎంపీలు మేకపాటి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఉదయం వారిని ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు.
ఈ నేపధ్యంలో దీక్ష పై వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత స్పందించారు. “మా ఎంపీ ల ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరింది.మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డిని ఇప్పటికే ఆస్పత్రికి తరలించారు. మోదీజీ.. ఎంపీల జీవితాలు, ఏపీ భవిష్యత్ ఆందోళనలో ఉన్నాయి. హోదాపై మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి” అని జగన్ ట్వీట్ చేశారు.
Our MPs are on hunger strike for the 4th day now. MRR,VP & YVSR have already been hospitalised. @narendramodi ji, the lives of these MPs & the future of the people of AP are at stake. Requesting you to please fulfill the promise you made to us on SpecialCategoryStatus.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2018