ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. భారత షూటర్ జీతు రాయ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధించాడు. ఇవాళ జరిగిన ఈ పోటీల్లో రికార్డు పాయింట్లతో అతను గోల్డ్ మెడల్ను కొల్లగొట్టాడు. ఇదే పోటీలో మరో భారత షూటర్ ఓంప్రకాశ్ మిథర్వాల్ కాంస్యం పతకాన్ని సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ పోటీలో 235.1 పాయింట్లు సాధించి.. జితు రాయ్ మొదటిస్థానాన్ని సాధించగా.. ఆస్ట్రేలియా షూటర్ కెర్రీ బెల్ 233.5 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
India wins two more medals in #shooting as Jitu Rai and Om Prakash Mitharwal bag gold and bronze respectively #CommonwealthGames2018
Read @ANI story | https://t.co/E9uGThPaSW pic.twitter.com/9Ex0ZkVWL3
— ANI Digital (@ani_digital) April 9, 2018