తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిల్మ్ నగర్లో నిన్న రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా ఓ యువతి పీకలదాకా త్రాగి వచ్చి రోడ్డు మీద వీరంగం సృష్టించింది.అంతే కాకుండా అకడ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వాటర్ బాటిల్స్ విసిరింది.అంతటితో ఆగకుండా అక్కడ తనిఖీలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై రాళ్లతో దాడి చేసింది.దీంతో వెంటనే పోలీసులు మహిళా కానిస్టేబుల్ సహాయంతో ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు.కాగా నిన్న తనిఖీల్లో 103 ద్విచక్రవాహనాలు, 46 కార్లు, 2 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు.
