ఆర్జేడీ అధినేత, రైల్వేశాఖ మాజీ మంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తో ఐశ్వర్య రాయ్ వివాహమేమిటి..? అని మీరు ఆశ్చర్యపోతున్నారా..అవును మీరు చదివింది నిజమే..కాని మీరు అనుకుంటునట్లు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కాదు.. బీహార్ మాజీ సీ ఎం దరోగా ప్రసాద్రాయ్ మనుమరాలుతో. ఆమె పేరు కూడా ఐశ్వర్య రాయే .ఆమె తండ్రి సీనియర్ ఆర్జేడీ నేత చంద్రికా రాయ్…మరీ చంద్రికా రాయ్..లాలూ కు ఎలా తెలుసు అనుకుంటున్నారా..?అప్పట్లోలాలూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయన మంత్రిగా పనిచేశారు. అయితే వీరి పెండ్లి వచ్చే మే 12న అంగరంగ వైభవంగా జరిపించేందుకు లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవి ఏర్పాట్లు చేస్తున్నారట. ఈనెల 18 న నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా లాలూ కుటుంబీకులు వెల్లడించారు.
