టాలీవుడ్ లో ప్రముఖులు, నటులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు వార్తా చానళ్లు, యూట్యాబ్ చానళ్లతో మాట్లాడుతున్నారని టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ప్రతినిధి పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించారు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. న్యాయ నిపుణుల సలహా మేరకు కేసు నమోదు చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.. తెలుగు అమ్మాయిలను తక్కువగా చూస్తున్నారని, అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయారు. పరభాషా నటీనటులను ప్రోత్సహిస్తున్నారని, తెలుగువారిని అక్కునచేర్చుకోవడం లేదని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. మరి ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు కేసు ఏమౌతుదో వేచి చూడలి.
