తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జార్ఘండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హిమంత్ సోరెన్ ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కల్సి ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు ఏళ్ళుగా టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే పాలనను నేర్పుతున్నారు.
ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం అని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.కాళేశ్వరం పూర్తయితే రాష్ట్రంలో కరువుండదని.రైతన్నల ఆత్మహత్యలు ఇక ముందు చూడము అని ఆయన అన్నారు ..