Home / ANDHRAPRADESH / పల్నాడులో ఎవరికన్నా కష్టమోస్తే కళ్ళు మూసి తెరిచేలోపు మీముందుంటా ..!

పల్నాడులో ఎవరికన్నా కష్టమోస్తే కళ్ళు మూసి తెరిచేలోపు మీముందుంటా ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పంతొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది . పాదయాత్రలో భాగంగా జగన్ నరసారావు పేట లో పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా నరసారావు పేటలో భారీ బహిరంగ సభను నిర్వహించారు .ఈ సభలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం .

ప్రజలకు సంక్షేమం అందుతుంది .పల్నాడు ఇలా ఉందంటే కారణం దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వలనే. మరల రాజన్న పాలన రావాలంటే జగనన్న సీ ఎం కావాలి .పల్నాడు లో ఎక్కడైనా సరే ఎవరికీ ఏ కష్టం వచ్చిన కానీ కాకితో కబురు పంపండి ఈ కాసు మహేష్ రెడ్డి వస్తాడు .మీ కష్టాల్లో తోడుంటాడు .. మీకు కల్గిన కష్టాన్ని తీరుస్తాడు .నరసారావు పేటలో టీడీపీ నేతలకు భయపడద్దు.. వాళ్ళ అరాచక పాలన మరి ఇంకొన్ని నెలలే ఆ తర్వాత జగనన్న నాయకత్వంలో రాజన్న పాలనా వస్తుందని ఆయన భరోసా ఇచ్చారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat