పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం స్వభావం ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత ..వందకు పైగా సినిమాలకు కథ మాటలు రాసిన రచయిత.ఆయన ప్రస్తుతం తెలుగు మీడియా ఛానల్స్ లో ఒకటైన టీవీ9 కి ఇటివల ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో మీరు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎవరికీ మద్దతు ఇస్తారు అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
పోసాని మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కంటే ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే నేను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను నమ్ముతాను.వచ్చే ఎన్నికల్లో జగన్ కే ఓటు వేస్తాను అని తేల్చి చెప్పారు.ఇంకా జగన్ గురించి ఏమి అన్నారో మీరు ఒక లుక్ వేయండి వీడియో మీద .. !