తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొలకత్తా కు చేరుకున్నారు.ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు దిశగా.. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మొదటి పశ్చిమ బెంగాల్ పై అయన దృష్టి పెట్టారు. ఆ పార్టీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సీఆర్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో ఎంపీలు కవిత, కేకే, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ సీఎం వెంట వెళ్లారు.
కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో బెంగాల్ రాష్ట్ర ప్రతినిధులు స్వాగతం పలికారు. అక్కడి నుంచే నేరుగా పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ కు.. పుష్పగుచ్చం అందించి స్వయంగా బెనర్జీ స్వయంగా స్వాగతం పలికారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ తర్వాత తన ఛాంబర్ కు తీసుకెళ్లారు.ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత, ప్రస్తుతం దేశంలోని రైతుల పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై వీరి చర్చ చర్చలు జరగనున్నాయి. 7 గంటలకు కోల్ కతాలోని కాళీమాత ఆలయాన్ని దర్శించుకోనున్నారు కేసీఆర్. ఆ తర్వాత హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు..