వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైసీపీ శ్రేణులకు, ఆ పార్టీ అభిమానులను ఉగాది పండుగ సందర్భంగా సీబీఐ చెప్పిన శుభవార్తే అని చెప్పుకోవాలి. అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన విషయం విధితమే.
see also : ప్రభాస్ కు ఆ పిచ్చి ఉంది..శ్రీ రెడ్డి సంచలన వాఖ్యలు..!!
see also : కుక్కలు, నక్కలు కన్నట్టు పిల్లల్ని కని..! చ్ఛి..చ్ఛీ..!!
అయితే, గత అధికార పార్టీలు జగన్పై పెట్టిన అక్రమ కేసులు కోర్టులో అలా విచారణకు వచ్చి.. ఇలా వీగిపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత శుక్రవారం నాంపల్లిలో ప్రత్యేక కోర్టుకు ఆయన హాజరవుతుంటాడు.అయితే తాజాగా ఈడీ అటాచ్ చేసిన జగన్ కు చెందిన జగపతి పబ్లికేషన్ ముప్పై నాలుగు కోట్ల ఆస్తులపై ఉన్న పీఎంఎల్ఏ ను ట్రిబ్యునల్ కొట్టేసింది. అంతేకాకుండా, అంతకు ముందు జగన్పై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్) నమోదు చేసిన కేసులను అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఇలా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీబీఐతోపాటు, ఈడీ నమోదు చేసిన కేసులన్నీ కోర్టుల్లో ఒక్కొక్కటిగా వీగిపోతుండటంతో పచ్చ మీడియా, ఏపీ అధికార పార్టీతోపాటు, పచ్చ మీడియా గొంతులో ఎలక్కాయపడ్డట్టయింది.
see also : చంద్రబాబు ఊహించని పరిణామం..! నారా లోకేష్కు జైలు కన్ఫాం..!!
ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ పై బనాయించిన అక్రమ కేసులపై సీబీఐ రిటైర్డ్ ఎస్పీ సుభాష్ చంద్రబాబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్పై పెట్టిన అక్రమ కేసులన్నీ కోర్టుకు వచ్చిన వెంటనే వీగిపోతున్నాయని, అంతేకాకుండా, సీబీఐ, ఈడీ నిందితులుగా పేర్కొన్న ఐఏఎస్లు, మరికొందరు ఇప్పటికే నిర్దోషులుగా బయటకు వచ్చారన్నారు. జగన్పై బనాయించిన కేసులు ఇలా కోర్టుకు వచ్చి.. అలా వీగిపోతున్నాయని, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో పస లేదని తనదైన శైలిలో చెప్పారు సుభాష్ చంద్రబోస్.
see also : పవన్, బాబుల గురించి పచ్చి నిజాలు చెప్పిన సినీహీరో..!!
క్విడ్ ప్రో కేసులో ఎక్కడా వైఎస్ జగన్ ఇన్వాల్వ్మెంట్ లేదన్నారు. ఆ కేసుకు సంబంధించిన ఫైల్ మూమెంట్కు జగన్కు సంబంధం లేదని స్పష్టతనిచ్చారు సుభాష్ చంద్రబోస్. ఆధారాలు ఉంటేనే సీబీఐ అరెస్టు చేయాలి కదా..? మరి ఆధారాలు లేకుండా సీబీఐ జగన్ను ఎందుకు అరెస్టు చేసింది..? అన్న ప్రశ్నకు సుబాష్ సమాధానమిస్తూ.. అవన్నీ రాజకీయ అంశాలని, అవి నేను చెప్పకూడదంటూ జవాబును దాట వేశారు. ఏదేమైనా వైఎస్ జగన్ త్వరలో నిర్దోషిగా బయటకు వస్తారంటూనే సీబీఐ రిటైర్డ్ ఎస్పీ సుభాష్ చంద్రబాబోస్ తన ఇంటర్వ్యూను ముగించారు.