తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ తనయ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఆమె జన్మదినం వేడుకలను తన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
see also :కాంగ్రెస్ దాడి..అసలు గుట్టు విప్పిన కేసీఆర్..!
సాధారణంగా మోడీ అందరికి ఇంగ్లీష్ లో లేదా హిందీలో శుభాకాంక్షలు తెలుపుతారు.కాని ఎంపీ కవిత జన్మదినం సందర్భంగా ఆయన తెలుగులో శుభాకాంక్షలు చెబుతూ ఒక లేఖ రాసారు.ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
see also :కేటీఆర్ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మన్ ఫిదా..!
మీ జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి.. మీరు దేశ ప్రజలకు సేవలందించేందుకు కావాల్సిన ఆరోగ్యకర, ఆనందకర జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.. ఇట్లు మీ భవదీయ నరేంద్ర మోదీ అంటూ ఆ లేఖలో బర్త్ డే విషెస్ చెప్పడం విశేషం.
see also :ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!