రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్కు లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మోడీ సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెపుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. నాడు అమిత్షా లక్షా 50వేల కోట్ల రూపాయలను ఏపీ అభివృద్దికి ఇచ్చామని చెప్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు. ఆ లక్షా 50 వేల కోట్లలో చంద్రబాబు వాటా ఎంత..? బీజేపీ నేతల వాటా ఎంత..? అనేది తేలాల్సి ఉందంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
see also : ఎవరు చేశారు ..?.ఏమి చేశారు ..!
see also : కోరిక ఉంటే చాలు..!!
ఆ రోజునే బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా తెలంగాణ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం లక్షల కోట్లు కేటాయించిందని చెప్తే.. ఆ వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ మీరు కేటాయించిన లక్షల కోట్లకు సంబంధించి లెక్కలతో సహా చెప్పండి అంటూ అమిత్షాను ఏకి పారేశారన్నారు. చంద్రబాబు మాత్రం తనపై ఉన్న కేసులకు భయపడి ప్రశ్నించలేక పోయారని ఎద్దేవ చేశారు.