బీజేపీ పార్టీకి చెందినా సీనియర్ ఎమ్మెల్యే ఈ రోజు బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.పర్సనల్ పని మీద సదరు ఎమ్మెల్యే తన కారులో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.అసలు విషయానికి వస్తే యూపీ అధికార బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ ప్రయాణిస్తున్న కారు బిజ్నూర్ జిల్లాలో సీతార పూర్ లో ఎదురుగ వస్తున్న ట్రక్ ను డీకోట్టడంతో ఎమ్మెల్యేతో పాటు ఉన్న ఇద్దరు గన్ మెన్లు ,డ్రైవర్ అక్కడక్కడే మరణించారు .సమాచారం అందుకున్న స్థానికులు ప్రమాదస్థలికి చేరుకొని పోలీసులు మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.నలబై ఏళ్ళ వయస్సున్న ఎమ్మెల్యే ధామాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి రెండు (2012,2017)సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు..
