- హాస్యనటుడు గుండు హనుమంతరావు 1956 అక్టోబర్ 10న విజయవాడలో జన్మించారు.
- హనుమంతరావు తల్లిదండ్రులు కాంతారావు ,సరోజినీ
- గుండు హనుమంతరావు కు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు
- 1974 లో 18 ఏళ్ల వయస్సులో నాటక రంగ ప్రవేశం చేశారు.
- నాటకాల్లో హనుమంతరావు వేసిన మొదటి వేషం రావణ బ్రహ్మ
- అహన పెళ్ళంట చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించి…సుమారు 400 సినిమాల్లో నటించారు . అంతేకాకుండా పలు టీ వీ సీరియల్స్ లో నటించారు.
- గుండు సినిమాల్లో నటించకముందు మిటాయి వ్యాపారం చేసేవాడు.
- అమృతం అనే టీ వీ సీరియల్ గుండు హనుమంతరావు కి మంచి పేరు తెచ్చి పెట్టింది.
- గుండు హనుమంతరావు మూడుసార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు.
- గుండు హనుమంతరావు నటించిన ప్రముఖ చిత్రాలు..బాబాయ్ హోటల్ ,కొబ్బరి బొండాం,యమలీల,హై హై నాయకా,ప్రేమ,మాయలోడు,పేకాట పాపారావు,నంబర్ వన్,శుభలగ్నం,వజ్రం,క్రిమినల్,వినోదం,కలిసుందాం రా,సత్యం,అతడు,భద్ర,అన్నమయ్య,రిక్షావోడు.
- హనుమంతరావు కు బాగా ఇష్టమైన సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ..ఫిబ్రవరి 19 ఉదయం ౩ గంటల సమయంలో స్వగృహంలో మరణించారు.