Home / ANDHRAPRADESH / వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్ర్భాంతి..!

వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్ర్భాంతి..!

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో విషాదం చోటుచేసుకుంది. సెఫ్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తూ అస్వస్థతకు గురైన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కాగా శుక్రవారం ఉదయం వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీహెచ్‌పీఎల్)కు చెందిన సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు మొత్తం ఎనిమిది మంది వచ్చారు. ట్యాంక్‌ నుంచి ఒక్కసారిగా విష వాయువు వెలువడటంతో వీరంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే వారిలో ఏడుగురు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరంతా మొరం గ్రామ సమీపానికి చెందినవారు. మృతులు రెడ్డప్ప, రమేష్‌, రామచంద్ర, కేశవ, గోవిందస్వామి, బాబు, వెంకట్రాజు శివగా గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మరోవైపు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ, ఏఎస్పీతో ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటనపై ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాడ సానుభూతి తెలిపారు. సమాచారం తెలుసుకున్న పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలకు నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.20 లక్షలు పరిహారంతో పాటు కోళ్లఫామ్‌ యజమానిపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. అంతేగాక సబ్‌ కలెక్టర్‌.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల తక్షణ సాయాన్ని ప్రకటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat