ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పి.. తీరా అధికారం చేపట్టాక ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా..? అని అంటూ కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీయే బాగుందంటూ తన కుఠిల రాజకీయాన్ని మరోసారి ప్రదర్శించారు.
