ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోమారు అనూహ్య కితాబు దక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. రాత్రి 7.30 గంటలకు కేసీఆర్.. అరుణ్ జైట్లీతో భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం కితాబు ఇచ్చారు.
`కేసీఆర్జీ..మీకు పెద్ద అభిమాని`అని అన్న అరవింద్ సుబ్రహ్మణ్యం అన్నారు. రైతులకు పెట్టుబడి ప్రోత్సాహం కింద నగదు ఇచ్చే పధకం బాగుందని ప్రశంసించారు. కాగా, హైదరాబాదులో లంచ్కు సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అరవింద్ సుబ్రహ్మణ్యం సోమవారం హైదరాబాద్ పర్యటించనున్నారు.