కాంగ్రెస్ నేతలు వీధీ రౌడీల్లా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు .ఇవాళ అయన మీడియా తో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వెన్నెముక లేని నేతలని దుయ్యబట్టారు. ఆరు దశాబ్దాల పాలనలో ప్రజలకు తాగడానికి నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు అని విమర్శించారు. మిషన్ భగీరథ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏడుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను తెలంగాణ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని అన్నారు.ప్రజలకు అవసరమైనంత మేర నీళ్లు ఇచ్చి తీరుతామని పల్లా రాజేశ్వర్రెడ్డి ఉద్ఘాటించారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.
