ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్ర కొన సాగుతంది. ఈపాదయాత్రలో బాగంగా కొత్త హామీని ఇస్తున్నారు. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్. తాజాగా మన పార్టీ అధికారంలోకి వస్తే.. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం..’ అని అంటూ.. రైతాంగానికి ఉచిత బోర్లు అనే కొత్త హామీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. .. ఇప్పుడు ఉచిత బోర్లు హామీని ఇస్తుండటం గమనార్హం. నేటి సాయంత్రం సౌత్ మోపూరు వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుందని వైసీపీ పార్టీ ప్రకటించింది.
