జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ శృంగార పాఠాలు నేర్పించి.. రూ.40 కోట్లు సమర్పించుకున్నాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వక ముందే పవన్ కల్యాణ్ రేణూదేశాయ్తో సహజీవనం చేసి కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ మరో ఇద్దరిపై కన్నేశాడు. అంతేకాకుండా వారిని కూడా రేణుదేశాయ్ లానే వాడుకున్నాడు. అంతటితో ఆగక వారిద్దరికి సంబంధించిన విషయాలను.. ఒకరి గురించి మరొకరికి తెలియకుండా మెయింటెన్ చేశాడు. చివరకు వారు.. తమను కూడా వివాహమాడాలని అడగడంతో ఏం చేయాలో తోచని స్థితిలో పవన్ కల్యాణ్ భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాడు. రేణుదేశాయ్లానే వారికి కూడా ఇంకా డబ్బు చెల్లిస్తూనే ఉన్నాడు.
ఈ విషయాలన్ని నా ఫేస్ బుక్ వేదికగా త్వరలో వెల్లడిస్తా..!! అంటున్నాడు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు బాగా దగ్గరి వ్యక్తి, సినీ క్రిటిక్ కత్తి మహేష్. ఆ మధ్యన ఒక పౌరుడిగా పవన్ కల్యాణ్ రాజకీయంపై ప్రశ్నించిన కత్తి మహేష్పై.. జనసేనాని అభిమానులు కత్తి మహేష్పై దాడికి పాల్పడటమే కాకుండా.. కత్తి మహేష్ శారీరక స్థితిపై కూడా పలు చిత్రాలను రూపొందించి షోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.
ఇక అసలు విషయానికొస్తే.. కత్తి మహేష్ ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కల్యాణ్ పూనం కౌర్, పార్వతీ మెల్టన్లతో ముంబయిలోని ఓ హోటల్లో వారం రోజులపాటు గడిపాడని, అందుకు సంబందించిన బిల్లులతో సహా నా వద్ద ఉన్నాయని చెప్పాడు. అంతేకాకుండా.. పార్వతీ మెల్టన్, పూనం కౌర్ అడ్డం తిరగడంతో వారికి అప్పటికప్పుడు 40 కోట్లకు పైగా పవన్ కల్యాణ్ చెల్లించాడని చెప్పారు కత్తి మహేష్. అప్పట్నుంచి వారికి సినీ ఇండస్ర్టీలో అవకాశాలు తగ్గాయని, అంతేకాకుండా పవన్ కల్యాణ్ ఇప్పటికీ రేణుదేశాయ్లానే పార్వతీ మెల్టన్కు, పూనంకౌర్ అనధికార భరణం చెల్లిస్తున్నాడని, అందుకు సంబంధించిన బ్యాంక్ సమాచారం తన వద్ద ఉంది, ఏఏ బ్యాంక్ అకౌంట్ల నుంచి.. ఎప్పుడెప్పుడు వారి ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసింది.. అన్ని విషయాలను తన ఫేస్బుక్ ఖాతాలో వెల్లడిస్తానని చెప్పాడు కత్తి మహేష్.
ఇటీవల కాలంలో పూనం కౌర్, పార్వతీ మెల్టన్తో ఒకే రూంలో పవన్ కల్యాణ్ ఉన్నాడని చెప్పిన కత్తి మహేష్.. ఇప్పడు వారికి చెల్లింపుల నిమిత్తం ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలను త్వరలో బయటపెడతానని చెప్పడం గమనార్హం. కత్తి మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలు.. నిజమో..!! కాదో..!! పవన్ అభిమానులే చెప్పాలి.