ఏపీలోని కర్నూల్ జిల్లా శ్రీశైలం రుద్రాక్ష మఠంలో ఓ సొరంగం బయటపడింది. దేవాలయ అభివృద్ధి పనుల కోసం దేవస్థానం, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాల్లో సుమారు పది అడుగుల లోతైన సొరంగాన్ని గుర్తించారు. ఈ తవ్వకాలలో పురాతన వస్తువులు లభించాయి. అవి ఎనిమిదో శతాబ్ధానికి చెందినవిగా గుర్తించారు. వాటిల్లో పూజ, వంట సామగ్రి అధికంగా ఉన్నాయి. దీపం పెట్టుకునేందుకు వీలుగా కొన్ని వస్తువులు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వాటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
