ఏపీలో ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్రజా సమస్యల కోసం గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరతం పడుతున్నారు. అయితే ఈ పాదయాత్రపై కొంతమంది టీడీపీ ఎమ్మెల్యే లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ..వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ఎద్దెవా చేశారు. 10 లక్షల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా జగన్ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. ప్రజలు ఇస్తే వచ్చేది సీఎం పదవి అని చెప్పారు. అవినీతి కేసుల్లో ఉన్న జగన్ ను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపు వెనక పవన్ కల్యాణ్ పాత్ర ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కూడా టీడీపీతో కలసి జనసేన ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ దే తుది నిర్ణయమని చెప్పారు.
