Home / CRIME / ఏపీలోఅన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు..చివ‌రికి వీళ్లు సఏం చేశారో తెలుసా…

ఏపీలోఅన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు..చివ‌రికి వీళ్లు సఏం చేశారో తెలుసా…

వరుసకు అన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమించుకునేందుకు ముందు ఆ విషయం వారిద్దరి తెలియదు. తీరా పెళ్లి చేసుకుందామనుకునే సమీపంలో బంధువులంతా వరుస కారని, వరుస కుదరకుండా పెళ్లి చేయడం బాగుండదని తేగేసి చెప్పారు.చివరికి ఏం చేయాలో తోచక.. కలిసి బతకలేక, విడిపోలేక ఆ ప్రేమ జంట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలంలోని శివపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివాపురానికి చెందిన సాయి(19), నల్గొండ జిల్లా దామచర్ల మండలం ఎల్‌బీ తండకు చెందిన సునీత(18)తో ప్రేమలో పడ్డాడు. తమకు పెళ్లి చేయాలంటూ ఇద్దరూ పెద్దలపై ఒత్తిడి చేశారు. వీళ్లిద్దరికీ వరుస కుదరదని కుటుంబీకులు, బంధువులు తేల్చిచెప్పారు. అయితే ఇంటి నుంచి పారిపోయిన ఈ జంట.. తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ జంట స్వగ్రామానికి చేరుకోగానే పెద్దలంతా పంచాయతీ పెట్టారు.

అయితే సునీతను చూడలేకుండా సాయి వుండలేకపోయాడు. సునీత కూడా సాయికి దూరంగా వుండలేకపోయింది. దీంతో ఈ జంట పెనుగంచిప్రోలులోని సుబాబుల్ తోటలోకి వెళ్లి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఈ జంట పరిస్థితి విషమంగా వుందని వైద్యులు నిర్ధారించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat