ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఈ పాదయాత్రకు సంబందించిన 72వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం సంగటూరు నుంచి ఆయన శనివారం పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చిల్లమాను చెన్నైక్రాస్, గుర్రంకొండ, అర్మేనుపాడు వరకూ సాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ప్రజాసంకల్పయాత్ర గూడూరు మండలం కాండ్ర నుంచి పునఃప్రారంభం అవుతుంది. వెంకటేశుపల్లి, తిమ్మ సముద్రం క్రాస్ వరకూ ఆయన యాత్రను కొనసాగిస్తారు.
