ఏపీలో రాజకీయం వెడెక్కుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ తెలుగు న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అభిప్రాయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వంశీ చెప్పారు. ఒకవేళ టిడిపి వద్దనుకొంటే తాను హైదారబాద్ లో వ్యాపారం చేస్తానని చెప్పడంతో టీడీపీ నేతల్లో చర్చలు మొదలైయ్యినాయి.
వివారాల్లోకి వెళ్లితే..
కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూకు బద్ధశత్రువు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఢీ అంటే ఢీ అంటూ కొట్లాడిన సంఘటనను ఆంధ్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదు. నెహ్రూను ముసలి రౌడీగా అభివర్ణిస్తూ, వల్లభనేని వంశీ ప్రత్యక్ష పోరాటానికి దిగారు. నెహ్రూ తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని వంశీ బహిరంగంగానే అప్పట్లో ఆరోపణలు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో దేవినేని నెహ్రూ హవా నడిచింది. ఇపుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. వల్లభనేని వంశీ గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెహ్రూ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. అధికారంలో ఉన్నా… గన్నవరం ఎమ్మెల్యే వంశీ తన పాత గొడవలను అక్కడ అక్కడ చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
కానీ, కాంగ్రెస్ నుంచి నెహ్రూ టీడీపీలోకి చేరడం… అదీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించడంతో వంశీకి ఇక మండిపోతోంది. ఈ తాజా మార్పులతో టీడీపీలో వంశీ అస్సలు ఇమడలేకపోతున్నారని తెలుస్తోంది. దీంతో టీడీపీ అధికారం 2019 లో వంశీకి టిక్కెట్ ఇచ్చే ఆలోచనలో లేనట్లు తెలుస్తుంది. ఇది కాని జరిగితే ఎలాగో జగన్తో సత్సంబంధాలున్నాయి కాబట్టి వైసీపీలో చేరేందుకు వంశీ రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గన్నవరంలో వైసీపీ తరపున మళ్ళీ పోటీ చేసి గెలవాలనే ఆలోచనలో వంశీ ఉన్నట్టు సమాచారం. పైగా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, విజయవాడలో వంగవీటి రాధా కూడా వంశీకి మంచి స్నేహితులు కావడంతో ఆయనకు వైసీపీ ఘన స్వాగతం పలుకుతుందంటున్నారు. వంశీ త్వరలోనే విజయవాడలో భారీ ఎత్తున సభ నిర్వహించి జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇదేగాని జరిగితే, వంశీ కారణంగా తిరిగి వైసీపీలోకి రిటర్న్ వలసలుంటాయని అంచనా వేస్తున్నారు.