ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అద్యక్షడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రతో ఇటు ప్రజల్లో…ఆటు వైసీపీ నాయకుల్లో కొత్త ఉత్సహం వచ్చింది. 2019 ఎన్నికల్లో విజమం వైసీపీదే అని వారు చెప్పుకుంటున్నట్లు సమచారం. మరో పక్క టీడీపీనే అధికారంలోకి వస్తాదని కొంతమంది పాయకులు అంటున్నారు. అంతేకాదు ఏ పార్టీకి ఎంత బలం వుందన్న దానిపై అప్పుడే రకరకాల సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ అయితే 2019 ఎన్నికల్లో వైసీపీకి 13 ఎంపీ స్థానాలు వస్తాయని, టీడీపి కూటమికి 12 ఎంపీ స్థానాలు ఖాయమని తేల్చింది.
అయితే ఇవన్ని పుకర్లే అంటున్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఇప్పుడున్న స్థానాలని మించి కైవసం చేసుకుంటుందనీ, ఏకంగా 135 నుంచి 145 స్థానాలను రాబట్టుకుంటుందని వెల్లడించారు. టీడీపీ విజయం సాధించబోయే స్థానాల్లో వైసీపి నుంచి అభ్యర్థులు కూడా పోటీ చేసే పరిస్థితి లేదని వెల్లడించారు. మహా వైసీపీ 30 నుంచి 35 స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందేమోనని ఆయన చెప్పుకొచ్చారు.