ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈరోజు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిచింది. 69వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఘనస్వాగతం పలికారు. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ వద్ద నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టారు వైఎస్ జగన్ . అయితే ఈ ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 28కి వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో 1000 కీలో మీటర్లు పూర్తి చేసుకోబోతున్నది. . ఈ సందర్భంగా సైదాపురంలో వైసీపీ స్తూపం ఎర్పాటు చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు హజరుకావలని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. జగన్ ప్రజసంకల్పయాత్రకు మద్దతుగా నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అధ్వర్యంలో 100 కార్లతో ర్యాలీగా వెళ్ళి స్వాగతం పలుకుతూ…భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో నెల్లూరు జిల్లా నిండిపోయింది.
