సీనీ విమర్శకుడు కత్తి మహేష్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ,ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేశారు .నిన్న ( గురువారం ) రాత్రి జూబ్లిహిల్స్ నుండి కొండాపూర్ వెళ్ళుతున్న సమయంలో శిల్పారామం దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తి మహేష్ పై కోడిగుడ్ల తో దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ సందర్బంగా దాడికి పాల్పడిన నిందుతుల పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు .ఈ నేపధ్యంలో తనపై జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాడి చేశారని కత్తి అనుమానం వ్యక్తం చేశారు . కత్తి మహేష్ ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడి చేశారంటూ ఫిర్యాదు చేసిన అనంతరం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు.
Case has been filed against those attackers and I don't withdraw it until the attackers feel regret about what they have did.
— Mahesh Kathi (@MaheshhKathi) January 19, 2018
నాపై దాడి చేసిన వారిపై కేసు నమోదైంది. నిందితులు తాము తప్పు చేశామని అంగీకరించి, విచారం వ్యక్తం చేసే వరకు ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని’ కత్తి మహేశ్ ట్వీట్ చేశారు.