మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదా అనే అనుమానం కలుగుతోందని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో భూకబ్జాను అడ్డుకున్న ఓ దళిత మహిళపై కొంత మంది అమానవీయంగా దాడి చేసి…ఆమెను ఈడ్చి పడేసి.. వివస్త్రను చేసి, ఆమహిళ దుస్తులను చింపి అవమానించిన సంగతి తెలిసిందే..తాజగా అంత కంటే దారుణంగా అదే ఏపీలోని సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురం మండలం గుంజార్లపల్లిలో ఓ మహిళను పూర్తిగా వివస్త్రను చేసి కాళ్లతో తన్నుతూ…అసభ్యకరమైన పధజాలంతో ఆమెను తిడుతూ చిత్రహింసలు పెట్టారు.
అంతేగాక ఆ వీడియోను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పెట్టడం చాలా సిగ్గుచేటు అని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
