అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రాబోతుంది.ఇప్పటికే పొలిటికల్ ,క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతున్న సందర్భంలో దర్శకులు ,నిర్మాతలు బయోపిక్ తీయడానికి ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త మాత్రం ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతుంది.అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని చేసిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మూవీ రాబోతుంది .ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో మమ్ముటి ప్రధాన పాత్రలో నటించనున్నారు అని ప్రముఖ దర్శకుడు మహి వి.రాఘవ్ తెలిపారు .
గతంలో ఆనందో బ్రహ్మ అనే బిగ్ బ్లాక్ బస్టర్ మూవీకి దర్శకత్వం వహించిన ఆయన ప్రస్తుతం వైఎస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయడానికి ముందుకు వచ్చా అని తెలిపారు .త్వరలోఈ మూవికి సంబంధించిన వివరాలు ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు .