Home / CRIME / ఏపీలో వ్యభిచారం… ఓ వ్యక్తిని హత్య చేసే వరకు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో

ఏపీలో వ్యభిచారం… ఓ వ్యక్తిని హత్య చేసే వరకు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో

ఏపీలో దారుణంగా నేరాలు జరుగుతున్నాయి. రౌడిలు నడిరోడ్ల మీద రెచ్చిపోయి హల్ చల్ చేస్తున్నారు. ఏమి తెలియని అమాయక ప్రజలపై దారుణంగా వ్యవహరిస్తున్నారు. మరి ముఖ్యంగా విశాఖ లో ఎక్కువగా జరుగుతున్నాయి.తాజాగా విశాఖలో తమ అక్రమ కార్యకలాపాలను నిలదీసిన ఓ యువకుడిపై కొందరు దుర్మర్గులు కత్తులతో దాడి చేశారు.. నిత్యం రద్ది గల ప్రాతంలో ఏ మాత్రం బెదరకుండా కత్తులతో పొడిచి రాడ్డుతో కొట్టి పరారయ్యారు. దీంతో ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళితే …
జీవీఎంసీ 15వ వార్డు అశోక్‌నగర్‌కు చెందిన పెద్దాడ సురేష్‌ (30) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఆశీలమెట్టలోని ద్వారకా వైన్స్‌ షాపు వద్ద ఉన్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, రాడ్డులతో చేసి పరారయ్యారు. అతన్ని వేంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈవిషయం తెలుసుకున్న లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ ఫకీరప్ప, ఏసీపీ పి.రామచంద్రరావు,సీఐ , ఎస్‌ఐలు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. సంఘటన స్థలంలో ఉన్న వారిని విచారించారు. ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఆ ప్రాంతంలోనే వ్యభిచారం జరుగుతుందని, ఆ ప్రాంతం నుంచి కుటుంబ సభ్యులతో వెళ్లాలన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆ విషయాన్ని ప్రశ్నించినందుకే సురేష్‌పై దాడి చేశారని వారు వెల్లడించారు. ఓ వ్యక్తిని హత్య చేసే వరకు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat