తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు.రంగారెడ్డి జిల్లా కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలో కులవృత్తులకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.రెడ్డి హాస్టల్కు పదెకరాలు భూమి కేటాయించి.. రూ. 10 కోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే క్రైస్తవులకు, బ్రహ్మణులకు ప్రత్యేక నిధులు కేటాయించి.. వారి అభివృద్ధి కృషి చేస్తున్నారు. గొల్ల,కుర్మల సంక్షేమ భవనానికి పది ఎకరాల భూమి కేటాయించారని గుర్తు చేస్తూ.. ఈ భూమి విలువ రూ. 200 నుంచి 250 కోట్లు ఉంటుందన్నారు.
