Home / SLIDER / పేద ప్రజల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్

పేద ప్రజల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్

పేద ప్రజల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేసారు.మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.నల్లగొండ జిల్లాలోని హలియా మండల కేంద్రంలో నిరుపేద క్రిస్టియన్లకు ప్రభుత్వం తరపున ఉచితంగా వస్ర్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు నిరుపేదలను ఓటు బ్యాంకుగానే చూశారని చెప్పారు. కానీ తమ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. రంజాన్ పండుగకు ముస్లింలకు, క్రిస్‌మస్ పండుగకు క్రిస్టియన్లకు సీఎం కేసీఆర్ ఉచితంగా బట్టలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయలేదని గుర్తు చేశారు. క్రిస్‌మస్ పండుగ కోసం భారతదేశంలో ఇప్పటి వరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు రోజులు సెలవులు ప్రకటించలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం క్రిస్‌మస్ పండుగకు రెండు రోజులు సెలవులు ప్రకటించిందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat