తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహా సభల కోసం జిల్లాల నుంచి కవులు, కళాకారులు తరలివస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మహా సభలకు వచ్చే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు స్పీకర్ మధుసూదనా చారి. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో హైదరాబాద్ కు బయలుదేరారు.
