తెలంగాణ రాష్ట్రంలో వర్ధన్నపేట అసెంబ్లీ నియోజక వర్గంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు .గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి …అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి ముందుకు వస్తున్నారు .
అంతే కాకుండా స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే అరూరి రమేష్ చేస్తున్న అభివృద్ధి వలన స్థానిక నేతలు నేడు పెద్దేత్తున టీఆర్ఎస్ గూటికి చేరారు .అందులో భాగంగా నియోజక వర్గంలో పర్వతగిరి మండలానికి చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్ లోకి చేరారు .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గొర్రె దేవేందర్,నోముల రమేష్ గార్లు వారివారి అనుచరులు,దాదాపు మొత్తం 500 మందికిపైగా పలువురు వివిధ పార్టీల నేతలు,కార్యకర్తలు ఎమ్మెల్యే అరూరి సమక్షంలో టీఆర్ఎస్ గూటికి చేరారు .