టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. 1992లో హెరిటేజ్ సంస్థను ప్రారంభించామని మంత్రి తెలిపారు. హెరిటేజ్ సంస్థ రూ. 2,600 కోట్ల టర్నోవర్కు చేరుకుందని మంత్రి తెలిపారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ మారుతూ ఉంటుందని, గత ఎనిమిదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ప్రతిపక్ష నేత జగన్ కూడా ఆస్తుల వివరాలు ప్రకటిస్తే మంచిదని,మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ తన ఆస్తులను ప్రకటించి.. ఆ తర్వాత తమపై ఆరోపణలు చేయాలని మంత్రి లోకేశ్ చెప్పారు. ఏపీలో ప్రతిపక్షం లేనేలేదని మంత్రి చెప్పుకొచ్చారు. తామే అధికారపక్షం.. తామే ప్రతిపక్షమని ఆయన వ్యాఖ్యానించారు.
