జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో వేసిన పంచ్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. వారసులు ఎవరైనా సమర్థత నిరూపించుకున్నాకే రాజకీయాల్లోకి రావాలని పవన్ అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మద్ధతు తెల్పకపోవడానికి కారణాలు తెల్పుతూ.. రాజశేఖర్ రెడ్డి చనిపోగానే జగన్ సీఎం కావాలనుకోవటం సరికాదని.. అందుకే తాను ఆయనకు మద్దతు ప్రకటించలేదని.. అంతే కాకుండా జగన్ దపై లక్షకోట్ల అవినీతి ఆరోపణలు కూడా ఉండడంతో జనసేన సపోర్ట్ చేయలేదని.. పవన్ వ్యాఖ్యానించారు.
పవన్ ప్రశ్నిస్తానని వేసిన పంచ్లు పీకే ఫ్యాన్స్చే చప్పట్లు కొట్టించినా.. అసలు నిజాల గురించి విశ్లేషిస్తే మాత్రం పవన్ వైపు వేల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వారసత్వం గురించి మాట్లాడిన పవన్ ముందు సినిమాల్లోకి ఎలా వచ్చావ్.. చిరంజీవి తమ్ముడిగానే కదా.. మరి దాన్ని వారసత్వ అనరా.. వారసత్వం లేకుండానే మెగా ఫ్యామిలీలో ఇంతమంది హీరోలు వచ్చారా.. ముందు దీనికి సమాధానం చెబితే వినాలని ఉంది. ఇక జగన్ ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు.. నిద్రలేవంగానే ప్రతివాడు జగన్ లక్ష కోట్లు తిన్నాడని వాగడం అలవాటు అయ్యింది… మరి ఇప్పటి వరకు అది నిరూపణ కాలేదే.. మొన్నటికి మొన్న చంద్రబాబే జగన్ సోనియాకి ఎదురు తిరగడం వల్లనే ఆ కేసు బనాయించారని చెప్పారు.. మరి నీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే చూపించు.. లేకపోతే ఏం పీకుదామని ఎదవ నాటకాలు ఆడుతున్నావ్ కాటమరాయుడు.. రాజకీయాల్లో తుస్సుమంటున్న నీ యధవ పుల్కా పంచ్లు నీ సోది సినిమాల్లోనే వాడుకో.. ప్రశ్నిస్తాను.. పీకుతాను అని పుష్కరాలకి ఒకసారి ట్విట్టర్లో అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి ఎదవ పంచ్లు వేస్తే ఇక్కడు వైఎస్ అభిమానులకు కూడా తిక్క రేగుతోంది.. వాళ్ళంతా ఒక్కసారిగా గుంపుగా వచ్చి మీ మీద పడితే.. అడిగే దిక్కు కూడా ఉండదని నెటిజన్లు సోషల్ మీడియాలో ద్వజమెత్తుతున్నారు.