ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏనిమిది సంవత్సరాల క్రితం కేసీఆర్ చేపట్టిన ‘దీక్ష’ ను గుర్తుచేసుకుంటూ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రాపోలు , న్యూ వేల్స్ ఇంచార్జి విక్రమ్ కటికనేని ఆధ్వర్యంలో ‘కేసీఆర్ దీక్ష దివస్’ ను ఘనంగా నిర్వహించారు. ప్రవాస తెలంగాణ బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా శాంతి యాత్ర ప్రారంభించారు,గులాబీ జెండాలు చేతబూని దారి పొడవునా ప్రాంతాన్నంతా జై తెలంగాణ మరియు జై కె సి ఆర్ నినాదాలతో హోరెత్తించారు.
టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు రాజేష్ రాపోలు అధ్యక్షత వహించి న ఈ కార్యక్రమంలో వారు ప్రసంగిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తన రాజకీయ పదవులన్నింటిని మరియు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి “కేసీఆర్ సచ్చుడో లేదా తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో కేసీఆర్ చేసిన దీక్ష ప్రాముఖ్యతను వివరించారు. ఉద్యమాన్ని ముందుండి నడిపి, తద్వారా 60 సంవత్సరాల తెలంగాణ కలను సాకారం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని తన భుజస్కందాలపై వేసుకొని మునుపెన్నడూ ఎరుగని విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొనిపోతు రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’ సాకారం చేసే దిశలో కేసీఆర్ కృషిని, పట్టుదలను వివరించారు,ఇంతటి గొప్ప నాయకుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రవ్వడం మన అదృష్టమనీ, దేశ చరిత్రలో కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ తరుణంలో ఆస్ట్రేలియా జాతికి కూడా ఆయన త్యాగాల్ని పరిచయం చేయడానికే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కేసీఆర్ పోరాట పటిమను, అలుపెరుగని పోరాటాన్ని,గాంధీజీ మార్గాన్ని అనుసరించి శాంతియుత దీక్ష ద్వారా కేంద్రం దిగివచ్చేలా చేసి తద్వారా తెలంగాణ రాష్ట్ర సిద్ధికి అయన చేసిన కృషిని కొనియాడారు.
విక్రమ్ కటికనేనిగారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఉద్యమ మరియు దీక్ష సమయంలో చేసిన త్యాగాలను వివరించారు. రాష్ట్రం సిద్దించిన తరువాత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని, ప్రవేశపెడుతున్న పథకాల గురించి ప్రశ్నా వేదిక నిర్వహించారు. ఘనంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్ పిన్నమ,పరశురామ్ మోత్కుల, జస్వంత్ కొడరపు, రవి ధూపాటి మాధవ్ కటికనేని, సాగర్ రెడ్డి ,లక్ష్మణ్ నల్లాన్, రవిసూరిశెట్టి , రవీందర్ రెడ్డి , ఇస్మాయిల్ , అరుణ్ , రజనీకాంత్ , కమలాకర్ , దినేష్ లతో పాటు ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొన్నారు.దీక్షాదివస్ ని నిర్వహించిన సిడ్నీ నాయకులకు టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల అభినందించారు..