ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి మరో నేత రాజీనామా చేశారు .రాష్ట్రంలో ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార టీడీపీ పార్టీలో చేరిన విషయం మరవకముందే మరో నేత రాజీనామా చేశారు .
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత సొంత జిల్లా చిత్తూరు లోని కుప్పం కు చెందిన మాజీ జెడ్పి చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు .అయితే ఆయన రాజకీయ భవిష్యత్తు పై ఎటువంటి ప్రకటన చేయలేదు .
అయితే ఆయన పార్టీ వీడటానికి గల కారణాలను చెప్పలేదు .. గత నాలుగు ఏండ్లుగా కుప్పం నియోజక వర్గంలో వైసీపీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేత రాజీనామా చేయడం ఆ పార్టీకి గట్టి దెబ్బె అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ..